కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 26 : కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల గోడౌన్ను కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్లో కొనసాగుతున్న రెండో స్థాయి తనిఖీ కార్యక్రమాన్ని పరిశీలించి, ఈవీఎంల తనిఖీ, మాక్పోలింగ్పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు.
ఎస్డీసీ కిరణ్ ప్రకాశ్, తహసీల్దార్ రమేశ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీవాణి, పలు రాజకీయపార్టీల ప్రతినిధులు సత్తినేని శ్రీనివాస్, కే రాజిరెడ్డి, ఎడమ సత్యనారాయణరెడ్డి, మిల్కూరి వాసుదేవరెడ్డి, బర్కత్ అలీ, కళ్యాడపు ఆగయ్య, నేరెళ్ల అంజయ్య, తదితరులు కలెక్టర్తో కలిసి ఎస్ఎల్సీని పరిశీలించారు.