రామగిరి, డిసెంబర్ 2: అసెంబ్లీ ఎన్నికల కౌ ంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధం గా సన్నద్ధం కావాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరిం గ్ కళాశాలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటిం గ్ నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమంలో ముజామ్మిల్ ఖాన్ కౌంటింగ్ పరిశీలకులు రామగుండం రాజేష్ సింగ్ రానా, మంథని సీపీ పటేల్, పెద్దపల్లి సీ.ఎన్ శ్రీధరతో కలిసి పాల్గొన్నారు. డిసెంబర్ 3న ఉదయం 8 గంటలకు జేఎన్టీయూ కళాశాలలోని ఆకాడమిక్ బ్లాక్-2లో జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెకింపు ఉంటుందన్నారు.
ప్రతి అ సెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో 14 కౌ ంటింగ్ టేబుల్, ఒక పోస్టల్ బ్యాలెట్ లెకింపు టేబుల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెకింపు బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెకింపు ప్రక్రియ సమయంలో ఫారం 13ఏ ఎట్టి పరిస్థితుల్లో బ యటికి రావద్దన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెకిం పు ప్రక్రియ నిబంధనల ప్రకారం చివరి రౌండ్ లెకింపు ప్రారంభానికి ముందు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్హాల్కు ముందస్తుగా కంట్రోల్ యూ నిట్లను హమాలీలు తీసుకుని వస్తారని, ప్రతి 2 టేబుళ్లకు ఒక హమాలీ ఉంటారని, వారికి డ్రెస్ కోడ్ ఉంటుందన్నారు.
ప్రతి టేబుల్ వద్ద వారికి కేటాయించిన కంట్రోల్ యూనిట్లు మాత్రమే చెక్ చేసి కౌంటింగ్ చేయాలన్నారు. కంట్రోల్ యూనిట్ లెకింపు ప్రారంభానికి ముందు కం ట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు ఫా రం 17సితో నమోదైన ఓట్లు సరి చూసుకోవాలని తేడా వస్తే వెంటనే సదరు కంట్రోల్ యూ నిట్ ను రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని కలెక్టర్ పేరొన్నారు. కంట్రోల్ యూనిట్లో క్లాక్ ఎర్రర్ వస్తే కొత్త బ్యాటరీ వేసి ఆన్ చేయాలని, అప్పటికి క్లాక్ ఎర్రర్ వస్తే రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని కంట్రోల్ యూనిట్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలన్నా రు. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు ఫారం 17సీలో నమోదైన ఓట్లను ట్యాలీ చేసుకొని రిజల్ట్ బటన్ ప్రెస్ చేయాలని, కౌం టింగ్ ఏజెంట్లకు ఫలితాలు చూపించి వాటిని నిర్దేశించిన నమూనాలో నమోదు చేయాలని, 14 టేబుల్ వద్ద కౌంటింగ్ పూర్తయిన తర్వాత, ఆ రౌండ్ వివరాలు రిటర్నింగ్ అధికారి వెల్లడించిన తర్వాత మాత్రమే తదుపరి రౌండ్ కౌంటి ంగ్ ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు.
కంట్రో ల్ యూనిట్ల ఓట్ల లెకింపు పూర్తయిన తర్వాత వీవీ ప్యాట్ల లెకింపు ప్రారంభమవుతుందని , వీవీ ప్యాట్ల ఓట్ల లెకింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం చేయాలని కలెక్టర్ పేరొన్నారు. కౌం టింగ్ నిర్వహించే సమయంలో అధికారులు, సి బ్బంది నిబంధనలను గుర్తించుకోవాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పా టించాలని కౌంటింగ్ హాల్లో అధికారులు, సి బ్బంది ప్రశాంతంగా వ్యవహరించాలన్నారు. ఎటువంటి సందర్భం ఎదురైనప్పటికీ లెకింపు ప్రక్రియ పకడ్బందీగా నమోదయ్యేలా చూసుకోవాలని, గందరగోళానికి గురి కావద్దన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెకింపు అప్రమత్తంగా చేయాలని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆ స్లిప్పులను బ్లాక్ కవర్లలో భద్రపర్చి సీల్ చే యాలని, ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ని ర్వహించాలని ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చే యాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరికీ సెల్ ఫోన్ అనుమతి లేదని కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన తనిఖీ నిర్వహించి ప టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.