కలెక్టరేట్, ఫిబ్రవరి 8: చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు విరివిగా రుణాలు అందజేసి ప్రోత్సాహం అందించాలని, వ్యవసాయ రుణాలు పెంచాలని డిస్ట్రిక్ట్ లెవల్ బ్యాంకర్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బ్యాంకర్లను ఆదేశించారు. జి ల్లా స్థాయి బ్యాంకర్స్, అధికారుల సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించారు. జిల్లా లీడ్ బ్యాం క్ అధికారి మల్లికార్జున్రావు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాలు, సాధింపులు, గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలను కలెక్టర్కు వివరించారు.
అనంత రం కలెక్టర్ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ప్రస్తుత బ్యాంకులు ఆర్థిక సంవత్సరంలో తమకు కేటాయించిన లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. సోలార్ విద్యుత్ యూనిట్లను స్థాపనకు ముందుకు వచ్చే పవర్లూమ్, రైస్మిల్లులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, చిన్నతరహాపరిశ్రమలు, హౌసింగ్ యజమానులకు బ్యాంకర్లు రుణాలు అందజేసి, ప్రో త్సాహం అందించాలన్నారు.
జిల్లాలో సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు ఆర్థిక ప్రోత్సాహాన్ని మరింతగా పెంచాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ బ్యాంకర్లు, అధికారులతో కలిసి జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2024-25 ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ఎల్డీఎం మల్లికార్జున్రావు, ఆర్బీఐ ఎల్డీవో సాయితేజారెడ్డి, నాబార్డు డీజీఎం జయప్రకాశ్, యూబీఐ చీఫ్ మేనేజర్ ప్రేమ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్, డీపీవో రవీందర్, డీఏవో భాస్కర్, డీఎఫ్వో శివప్రసాద్, డీఆర్డీవో శ్రీనివాస్. మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ పాల్గొన్నారు.