హుజూరాబాద్ టౌన్, నవంబర్ 4: ‘హుజూరాబాద్ గడ్డ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది. ప్రతిపక్షాల మాయమాటలకు ఇకడి ప్రజలు లొంగరు. ఎప్పుడు అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నరు. నాడు ఉద్యమంలో ఎలాగైతే అండగా ఉన్నారో.. నేడు కూడా అభివృద్ధి చేస్తున్న అధికార పార్టీకే అండగా ఉండి మద్దతు తెలుపుతుస్నరు.’ అని హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్రెడ్డి ప్రచారానికి అడుగడుగునా చకని స్పందన వస్తున్నదని, సంక్షేమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజలే స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారన్నారు. సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్కు అండగా ఉండాలని, కౌశిక్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్హాల్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో మూడోసారి సీఎంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తొమ్మిదన్నరేండ్లల్లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, పదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు మండిపడుతున్నారన్నారు. కేవలం కేసీఆర్ దూరదృష్టితో, సమర్ధతతో మాత్రమే తెలంగాణలో పేదల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలపై ఆ పార్టీ నేతలకే గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు.
నలభై ఏండ్ల నుంచి హుజూరాబాద్ గడ్డమీద కాంగ్రెస్ గెలిచి బట్ట కట్టలేదని, ఆ పార్టీని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని పేర్కొన్నారు. అన్ని సర్వేలు రాష్ట్రంలో బీజేపీకి మూడు నుంచి నాలుగు సీట్ల కంటే ఎకువ రావని తేల్చి చెబుతుండగా, అదే సర్వేలు బీఆర్ఎస్కు 70 నుంచి 80 సీట్లు వస్తాయని స్పష్టం చేస్తున్నాయని గుర్తు చేశారు. కొంతమంది పార్టీ బీ ఫాంతో గెలిచి ప్రజల ఆకాంక్షలను కాదని, ఇతర పార్టీల నేతల ప్రలోభాలకు లొంగి పార్టీ మారుతున్నారని, అలాంటి వారు వెళ్లినంత మాత్రాన బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారిని ప్రతిపక్షాల నేతలు పోగుచేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు అంత గుడ్డిగా నమ్మరని హితవు పలికారు.
సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్రెడ్డి, రాష్ట్ర నాయకుడు వర్ధినేని రవీందర్రావు, రావుల రాజలింగారెడ్డి, కౌన్సిలర్లు కే లావణ్య, ఎం ఉమాదేవి, కే రమాదేవి, టీ శ్రీనివాసగౌడ్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు ఇరుమల సురేందర్రెడ్డి, కిషన్రెడ్డి, కొండ్ర నరేశ్, ఎండీ ఇమ్రాన్, వి రాజిరెడ్డి, ఎం శ్రీనివాస్, గంట కొమురయ్య, పంజాల శ్రీధర్, నల్ల బాలరాజు, ఎం కుమార్యాదవ్, ఎండీ సలీం, లక్ష్మణామూర్తి తదితరులు పాల్గొన్నారు.