ఓదెల, అక్టోబర్ 10: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు..అరవై గ్యారెంటీలు ఇచ్చినా నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడోసారి కూడా ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. మంగళవారం పొత్కపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. గడపగడపకూ వెళ్లి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని, ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజల చేతిలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఐరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, ఎంపీపీ కునారపు రేణుకాదేవి, ఎం పీటీసీ రెడ్డి స్వరూప-శ్రీనివాస్, ఆర్బీఎస్ గ్రామాధ్యక్షుడు డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఆకుల మహేందర్, దాసరి రాజన్న, మ్యాడగోని శ్రీకాంత్గౌడ్, కో-ఆప్సన్ ఎండీ సాహెద్ అ లీ, అయిలుకుమార్, రవి, సర్వయ్య, అజారోద్దీ న్, తిరుపతి, సాయిలు, భాను, స్వప్న పాల్గొన్నారు.