ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మరోసారి జిల్లాకు వస్తున్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించే మానకొండూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నిర్వహించిన తొమ్మిది సభలు విజయవంతం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనోత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ నెల 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పాల్గొన్న అధినేత, సోమవారం మానకొండూర్ సభకు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు భారీగా జన సమీకణ చేస్తున్నారు. మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
– కరీంనగర్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గత నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టిన ఆయన, ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా తొమ్మిది చోట్ల ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. గత నెల 15న హుస్నాబాద్, 17న సిరిసిల్ల, ఈ నెల 2న ధర్మపురి, 3న కోరు ట్ల, 7న మంథని, పెద్దపల్లి, 17న ఒకే రోజు కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నా రు. ఈ నెల 26 వరకు ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు సభలకు హాజరుకానున్నారు. నేడు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించే మానకొండూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో అధినేత కేసీఆర్ పాల్గొననుండగా, బీఆర్ఎస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా మూడు జిల్లాల పరిధిలో ఉన్న మానకొండూర్ నియోజకవర్గంలోని మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ సభను విజయవం తం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రతి మండలంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి జన సమీకరణకు ప్ర త్యేకంగా కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆయనకు తోడుగా బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నా రు. వీరితోపాటు మండల శాఖల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా ప్రజలను సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి నేటి ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జనసమీకరణ చేసి తమ సత్తా చాటుకోవాలని నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.
ఇప్పటికే జరిగిన సభలు శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి. కాంగ్రెస్, బీజేపీలే లక్ష్యంగా అధినేత కేసీఆర్ సంధించిన మాట లు తూటాల్లా పేలాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో గెలు పే లక్ష్యంగా దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల్లో మరింత జోష్ ను నింపాయి. ఇది వరకే నిర్వహించిన సభలకు జనం భారీ సంఖ్య లో తరలి రావడంతో వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థులకు గెలుపుపై ధీమా ఏర్పడింది. సభల్లో కేసీఆర్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడమే కాకుండా ఈసారి మ్యానిఫెస్టోలో పొందుపర్చిన విషయాల ను కూడా ప్రజలకు చక్కగా వివరించారు. అదే స్థాయిలో కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది తమకు కలిసి వస్తుందనే ధీమాతో బీఆర్ఎస్ అభ్యర్థులు కనిపిస్తున్నారు.