కరీంనగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి తనకు కొడుకులాంటోడని, ఒకసారి మంచి ఏదో.. చెడు ఏదో ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. ఇదే జోష్ను ఈనెల 30 వరకు కొనసాగించి బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని సూచించారు. రాష్ట్రంలో వందకు వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తున్నదని, ఇక్కడ వేరే పార్టీ గెలిస్తే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదని ఎద్దే వా చేశారు. పాడి కౌశిక్రెడ్డిని గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. శుక్రవారం జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీకి ఓటు వేయాలో.. ఏ పార్టీ ప్రజల కు మేలు చేసిందో గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ గతంలో మనకు ఏం చేసిందో మీకు తెలుసని, కాంగ్రెస్ను నమ్మి 2004లో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇవ్వకండా అనేక మంది బలిదానాలకు కారణమైందని మండిపడ్డారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లో తలపెట్టానని, దీంతో చచ్చుకుంట తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చట్టాన్ని అతిక్రమించిందని, ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉండగా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో 157 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నవోదయ పాఠశాల లు, మెడికల్ కళాశాలల కోసం వంద లేఖలు రాశానని గుర్తు చేశారు. కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని, తెలంగాణలో నేను ఒప్పుకోకపోతే ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.25 వేల కో ట్లు కోతలు పెట్టారని తెలిపారు.
హుజూరాబాద్లో గెలిచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఈటల రాజేందర్ వీటి గురించి ఎందుకు మాట్లాడడని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి గెలిచి ఈటల చేసింది ఏమున్నదని జనా న్ని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పు డు మళ్లో కొత్త దుకాణం పెట్టిందని, రైతుబంధు ఇస్తూ దుబారా చేస్తున్నారని మాట్లాడుతున్నారని, ధరణి ని తీసేస్తామని, వ్యవసాయానికి మూడు గంటలే కరెంట్ ఇస్తామని అంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని, పేదల కోసమే నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థికో పార్టీ ఉంటు ందని, అందులో ఏ పార్టీ మంచిదో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఎవరో చెప్పారని, ఆలోచించకుండా ఓటు వేస్తే ‘మంది మాట లు పట్టుకుని మారుమానం పోతే మల్లచ్చే వరకు ఇల్లు కాలిపోయినట్లు అవుతుంది’ అని చెప్పారు. హుజూరాబాద్లో ఉన్న మేధావు లు, పెద్దలు, విద్యార్థులు, యువకులు, విజ్ఞులు చ ర్చ పెట్టాలని కోరారు. కౌశిక్రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి అని, బీఆర్ఎస్ అంటే పేదల పార్టీ అని స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి గెలిచిన ఈటల రాజేందర్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, యువకుడు, సమర్థుడైన కౌశిక్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
కౌశిక్ తనకు కొడుకులాంటోడని, ఇక్కడ ఈటల రాజేందర్ అంటే ఎవరికీ తెలియకముందే కౌశిక్ వాళ్ల నాన్న గులాబీ జెండాను ఎత్తుకున్నారని గుర్తు చేశారు. ‘పాలిచ్చే బర్రెను అమ్ముకుని, ఎగిరి తన్నే దున్నపోతును కొనుక్కున్నట్లు గతంలో న న్ను బాధపెట్టిన్రు. ఇపుడు అలాంటి పరిస్థితి రా వద్దు’ అని కోరారు. రైతు బంధు, 24 గంటల క రెంట్ రావాలన్నా, ధరణి కొనసాగాలన్నా కౌశిక్రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే హుజూరాబాద్లో కౌశిక్రెడ్డి గెలవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి తాను ఏం తక్కువ చేయలేదని, పదేళ్లలో అన్ని సమకూర్చామని, ప్రతి రైతుకు రైతుబంధు ఇచ్చామని, దళితులందరికీ దళితబంధు ఇచ్చామని గుర్తు చేశారు.
నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని వావిలాల, కమలాపూర్ మండ లం శనిగరం, ఉప్పల్, వీణవంక మండ లం చల్లూరును మండలాలు చేయాలని కౌశిక్రెడ్డి కోరుతున్నారని, తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉద్యమ గడ్డ అని, ఇక్కడి ప్రజలందరూ నావెంట నడిచిన వారేనని గుర్తు చేశారు. ఈ సభలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జమ్మికుంట, హుజూరాబాద్ చైర్పర్సన్లు తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, గందె రాధిక పాల్గొన్నారు.
పదిహేను సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నం. గడపగడప తొక్కుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూస్తున్న కౌశిక్రెడ్డిని గెలిపించి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ కౌశిక్ అన్నను ఆశీర్వదించండని హుజూరాబాద్ ఆడబిడ్డగా కొంగుచాచి అడుగుతున్న. నిత్యం ప్రజల మంచి కోరుకునే ఆయనకు అవకాశం ఇవ్వండి. గత నాయకుడికి, కౌశిక్రెడ్డికి తేడా చూడండి.
– పాడి శాలినీరెడ్డి, కౌశిక్రెడ్డి సతీమణి
మాడాడీని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు గిఫ్ట్ ఇద్దాం. మూడోసారి సీఎంను చేద్దాం. మా డాడీని గెలిపిస్తే మీకు రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తరు. మీరందరి మీద నమ్మకంతో నేనున్న. మీరంతా కారుగుర్తుకు ఓటేయండి.
-శ్రీనికారెడ్డి, కౌశిక్రెడ్డి కూతురు