కార్పొరేషన్, సెప్టెంబర్ 28: ‘కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి మూడున్నరేండ్లయినా బండి సంజయ్ ఒరగబెట్టిందేమీ లేదు. రాష్ట్రం గురించి, కనీసం తన నియోజకవర్గం గురించి ఏ రోజైనా.. ఏ భాషలోనైనా మాట్లాడిండా..? ఆయన అన్న ట్టు రాష్ట్రంలో, కరీంనగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడ బహిరంగ చర్చ పెట్టినా వచ్చేందుకు మేం సిద్ధమే. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలోనైనా, హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద అయినా సరే. వస్తాం. నువ్వు రెడీయేనా..? ఎంతసేపు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై విమర్శలు చేయడం తప్ప అభివృద్ధి, ప్రజల సమస్యలపై చర్చించిన దాఖలాలు ఉన్నాయా..? మేమొక్కటే చెబుతున్నాం.. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో, భాష వంకరగా ఉంటే ఊరుకునేది లేదని’ ఎంపీ బండి సంజయ్ను రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ హెచ్చరించారు. గురువారం కరీంనగరంలోని తారక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డితో బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ మంత్రి కేటీఆర్కు సవాల్ చేయడంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేస్తుంటే లాగులు తడుపుకొని రాజీనామా చేయని వ్యక్తి కిషన్రెడ్డి అని విమర్శించారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం బీజేపీ నేత మెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే, బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేసి గెలిపించుకున్నారని గుర్తు చేశారు. అప్పుడు ముందుకు రాని కిషన్రెడ్డిలాంటి వ్యక్తికి ఇప్పుడు చర్చకు వచ్చే దమ్ముందా..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ మూడున్నరేండ్లు ఎంపీగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశాడో..? చెప్పాలని ప్రశ్నించారు. కనీసం ఇన్నాళ్లూ ముఖం కూడా చూపించలేదని, ఎవరికి కనీసం కలువను కూడా లేదని విమర్శించారు. కరీంనగర్కు తాము మెడికల్ కళాశాల తీసుకువచ్చామని, మరి బీజేపీ ఎందుకు తీసుకురాలేకపోయిందో చెప్పాలన్నారు. రైల్వే ప్రాజెక్టు కోసం రూ.1200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, భూ సేకరణ కూడా సైతం చేస్తున్నదని, మరి కేంద్రం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఎంపీగా బండి సంజయ్ ఏం ప్రాజెక్టు తీసుకువచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్కి లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఏ ఆరోపణలతో తొలగించారో ప్రజలందరికీ తెలుసునన్నారు.
అక్కరకు రాని హామీలు, అవినీతి ఆరోపణలతోనే పదవి తొలగిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నందునే పదవి నుంచి తొలగించారోమోనని అనుమానం వ్యక్తం చేశారు. బండిసంజయ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. తమకు కూడా తెలంగాణ యాసలో ఇంకా మంచిగా మాట్లాడడం వచ్చునని గుర్తు చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి జిల్లాకో కేంద్రియ విద్యాలయాన్ని ఎందుకు మంజూరు చేయించలేదో..? చెప్పాలన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, మెడికల్ కళాశాలల ఏర్పాటుతో మన ప్రాంత పిల్లలు 10 వేల మంది డాక్టర్లు కాబోతున్నారని, వీటిల్లో బీజేపీ పాత్ర ఏముందో చెప్పాలన్నారు.
కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి రాష్ర్టానికి ఒక్క ప్రాజెక్టు అయి నా తీసుకువచ్చారా..? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన వ్యక్తితో ఏం చర్చిస్తామని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి బలం ఏమిటో.. ప్రజ లే తేలుస్తారని చురకలంటించారు. త్వరలోనే బండి సంజయ్ ఎక్కడ..? ఏం చేశారో..? ఆయన బం డారం అంతా బయటపెడుతామని హెచ్చరించా రు. ఎంత సేపు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై విమర్శలు చేయడం తప్ప అభివృద్ధి, ప్రజల సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని రవీందర్సింగ్ హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుం జపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్కుమార్, కెసారం తిరుపతి, రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.