హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 16 : చట్టం ముందు అందరూ సమానులేనని, తప్పు చేసిన ఎవరికైనా శిక్ష తప్పదని హుజూరాబాద్ పట్టణ సీఐ బొల్లం రమేశ్ స్పష్టం చేశారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న మండలంలోని చెల్పూర్కు చెందిన బాధితురాలి కొడుకు తన తల్లి ఆతతప్పు చేసిన వారెవరైనా శిక్ష తప్పదు : సీఐ రమేశ్
హుజూరాబాద్ పట్టణ సీఐ రమేశ్మ్హత్యాయత్నానికి పాల్పడిందని, దీనికి
ఆ గ్రామ సర్పంచ్ నేరెళ్ల మహేందర్గౌడ్, వార్డు సభ్యుడు ఎండీ అజ్జు కారణమంటూ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశామని పేరొన్నారు. ఈ ఘటనలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యుడిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. చట్ట పరిధిలోనే కేసును విచారణ చేసి కేసు నమోదు చేశామన్నారు. కొంత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేవలం పోలీసులపై బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఇలాంటి తప్పుడు ఆరోపణ చేస్తున్నారని పేరొన్నారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి ఈటల రాజేందర్ తప్పుడు ఆరోపణలు చేస్తే పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోతుందని, నిజా నిజాలు ఏంటో అర్థం చేసుకొని మాట్లాడాలని సీఐ హితవు పలికారు. ఆయన వెంట ఎస్ఐ ఆసిఫ్ ఉన్నారు.