మంథని, డిసెంబర్ 25: క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా చోట్ల చర్చిల వద్ద క్రైస్తవులకు ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, మంథనిలోని బేతేలు గాస్పెల్ చర్చిలో జరిగిన వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరై కేక్ కట్ చేశారు. పేద క్రైస్తవులకు ప్రభుత్వం తరపున క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను అందజేశారు.