చొప్పదండి, మార్చి 10 : పట్టుదల, ఏకాగ్రతతో చదివితే సాధించలేనిదేమీ లేదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. పది ఫలితాల్లో ప్రతి ఒక్కరూ 10 జీపీఏ సాధించి రుక్మాపూర్ మోడల్ స్కూల్ను ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుపాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలకు సమ యం తక్కువగా ఉన్నందున విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి, రాత్రి క్లాసులపై దృష్టిపెట్టాలన్నారు. అందుకు భోజన సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, మూత్రశాలలు సరిగా లేవని, నిధులు మంజూరు చేయాలని, గ్రంథాలయం డెవలప్ చేయాలని ప్రి న్సిపాల్ ప్రిన్సిపాల్ రమేశ్ కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, నిధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళా టీచర్లకు మ హిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక ర వీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, ఎంఈ వో వేణుకుమార్, ప్రిన్సిపాల్ రమేశ్, వైస్ ప్రిన్సిపాల్ వరప్రసాద్, రైతు బంధు సమితి జిల్లా స భ్యులు మచ్చ రమేశ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు గుంట రవి, చిలుక లింగయ్య, లింపెల్లి లావణ్య, పెద్ది శం కర్, సురేశ్, రామకృష్ణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ రాజు, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, బం దారపు అజయ్కుమార్, గోపు శ్రీనివాస్రెడ్డి, ధీటి మధు, ఎం యువరాజ్, సదాశివారెడ్డి, కట్టెకోల లక్ష్మణ్, బండారు స్వామి, కుమార్ పాల్గొన్నారు.