కార్పొరేషన్, మార్చి 17: లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేస్తున్న దాడులు మోడీ చేయిస్తున్న దాడులేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆడబిడ్డ కవితక్కపై తప్పుడు ప్రచారాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆమ్ఆద్మీ పార్టీ నాయకులతో కవితక్కకు కేవలం రాజకీయ సంబంధాలు తప్ప మరేలాంటి సంబంధాలు లేవన్నారు. మహిళ అని కూడా చూడకుండా 9 గంటల పాటు ఈడీ విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టిందన్నారు. చట్టపరంగా తనను ఇంట్లో విచారించాలని కవిత కోరుతున్నా ఈడీ పట్టించుకోవడం లేదన్నారు.
ఎమ్మె ల్సీ కవితను నిందితురాలిగా చూపించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను మొదలు చేయగానే అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ దాడుల పేరుతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా తమకు అనుకూలంగా లేని వారిపై ఈడీ, సీబీఐతో దాడులు చేయించడం ప్రజలందరు గమనిస్తున్నారని తెలిపారు. అవినీతిపరులంతా కూడ బీజేపీలో చేరితే ఎలాంటి కేసులు ఉండడం లేదని ఎద్దేవా చేశారుర. దేశాన్ని కొల్లగొట్టే కార్పొరేట్ దోపిడీ దారులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును దొచుకుంటున్న అదానీపై ఎందుకు ఈడీ దాడులు చేయడం లేదని నిలదీశారు.
విజ య్ మాల్యా, నీరవ్మోడీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మోడీ గతంలో చాయ్ అమ్ముకున్న విధంగా ఇప్పుడు దేశాన్ని అమ్ముతున్నారని ఆరోపించారు. షాబొద్దీన్ కేసులు అమిత్షా సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారని, ఎమ్మెల్యే కోనుగోలు కేసులోనూ బీఎల్ సంతోష్కు సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. 9 ఏళ్ల మోడీ పాలనలో భారత దేశం 90 ఏళ్ల వెనకి వెళ్లిందని పేర్కొన్నారు. కవితక్క కూడా సుప్రీంకోర్టుకు పోతే ఇప్పుడు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కవితక్కను నిందితురాలిగా చూపించే ప్రయత్నం చేసే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, చొప్పదండి నాయకులు సురేందర్ రెడ్డి, చొక్కారెడ్డి, నర్సింగరావు, రవీందర్, వీర్ల వెంకటేశ్వర్రావు, నాగరాజు, దూలం సంపత్ తదితరులు పాల్గొన్నారు.