మల్యాల, అక్టోబర్ 29: ‘ఎన్నికలు వచ్చాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో గ్రామాల మీద పడ్డయి. కాం గ్రెస్ అన్నీ ఫేక్ హామీలు ఇస్తున్నది. కర్ణాటకలో వ్యవసాయానికి పుష్కలంగా కరెంట్ ఇస్తామ ని నమ్మించి మోసం చేసింది. అక్కడ మూడు గం టల కంటే ఎక్కువ ఇస్తలేరు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే ఏం చేయలేక చేతులెత్తేసింది. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సాగుకు మూడు గంటలే చాలు అంటున్నడు. నేనొక్కటే అడుగుతున్నా.. 3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా..? 24 గంటల నిరంతర విద్యు త్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? మీరే ఆలోచిం చుకోండి’ అంటూ చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
మల్యాల మండలంలోని రాజారాం, పోతారం, ఓగులాపూర్, రాంపూర్లో సుంకె రవిశంకర్ స్థానిక నాయకులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కాగా గ్రామాల్లో సుంకె రవిశంకర్కు అడ గడుగునా మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ మాట్లాడారు. తెలంగాణలో పదేండ్ల క్రితం ఉన్న పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఘననీయమైన అభివృద్ధి జరిగిందని వివరించారు. ప్రత్యేకంగా సాగునీటి ప్రాజెక్ట్ల వల్ల నియోజకవర్గం సస్యశ్యామలమైందని హర్షం వ్యక్తం చేశారు. మరోసారి సీఎంగా కేసీఆర్ కావాలంటే ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో మలిచి స్థానికంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ‘ఏ కష్టం వచ్చిన అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసేవాడిని.. మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే… మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని’ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మండలాధ్యక్షుడు జనగం శ్రీనివాస్, జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, జడ్పీ కో-ఆప్షన్ సుభాన్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, సహకార సంఘాల అధ్యక్షులు ముత్యాల రాంలింగారెడ్డి, అయిల్నేని సాగర్రావు, బోయినిపల్లి మధుసూదన్రావు, వైస్ ఎంపీపీ పోతాని రవి, సర్పంచులు బద్దం తిరుపతిరెడ్డి, ఎడిపల్లి సుగుణాఅశోక్, పొన్నం సరోజనామల్లేశం, గొడుగు కుమారస్వామి, సుంకె లచ్చయ్య, బద్దం తిరుపతి, నాయకులు తైదల శ్రీలత, కాకెర సుదర్శన్రెడ్డి, పిట్టల శ్రీను, ముద్దం చందు, కోటేశ్వర్రావు, కట్కూరి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.