చందుర్తి : వారంతా చిన్ననాటి స్నేహితులు… ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రుల కలను సహకారం చేయాలనే లక్ష్యంతో విద్యనభ్యసించి కొందరు ఉద్యోగరీత్యా స్థిరపడగా. మరికొందరు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. నేటితరం గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేములవాడకు చెందిన జవహార్ లాల్ నెహ్రూ పాఠశాల పదవ తరగతి 97-98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ( Freinds Charitable Trust ) నిర్వాహకులు.
చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ట్రీపుల్ ఐటీ కి ఎంపికైన పులి కీర్తన, ఎల్లా చరణ్ లకు ప్రతినెల ఒక్కొక్కరికి రూ. 3వేలు చొప్పున ఆరు సంవత్సరాల పాటు ఉపకార వేతనాలు ( Scholarships ) అందజేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి మూడు నెలలకు సంబంధించిన రూ. 9వేల చెక్కులను అధ్యాపకుల సమక్షంలో విద్యార్థులకు అందజేశారు.
విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన 98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు హింగే శివం, సుమన్ శర్మ, వెంగలి రవి, జనగామ తిరుపతి లను ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర అభినందించారు.