వేములవాడ, జూన్ 1: ఐదు వందల కోడెలు ఉండే స్థలంలో పన్నెండు వందల కోడెలు ఎలా ఉంటాయని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. ఆహారం అందక, అనారోగ్యంతో చనిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే, విప్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం వహించడంతోనే కోడెలు పిట్టల్లా రాలిపోయాయని ఆవేదన చెందారు. అందుకు కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేములవాడలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో ఎకడ చీమ చిటుకుమన్నా మాట్లాడే ఆది శ్రీనివాస్ కోడెలు మృత్యువాత పడుతున్నా ఎందుకు స్పందించడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందుగా రాజన్నకు మొకులు చెల్లించుకునే ఆనవాయితీలో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి కోడెలు సమర్పిస్తున్నారని, మరో వైపు గుడి బంద్ చేస్తారన్న ప్రచారంలో భాగంగా భక్తులు వేలాదిగా తరలివస్తూ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన నిజ కోడెను సమర్పించుకుంటున్నారని తెలిపారు.
ఆరు నెలల కిందట మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సిఫారసు లేఖతో ఒకరికి 60 కోడెలు కేటాయించడం వివాదాస్పదంగా మారి ఈ పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందేనని, దీంతో కేవలం 500 కోడెలను ఉంచే తిప్పాపూర్ గోశాలలో 1200కు పైగా ఉంచారని తెలిపారు. ఈ కారణంగా కోడెలు అనారోగ్యం బారిన పడి సరైన ఆహారం అందక మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ పశు వైద్యాధికారులే నిర్ధారించడం దురదృష్టకరమన్నారు. గడిచిన మూడు రోజుల్లో తిప్పాపూర్ గోశాలలో 18 కోడెలు మృతి చెందాయన్నారు. స్వామివారికి కోడె మొకు ద్వారా ఏడాదికి దాదాపు 22 కోట్ల ఆదాయం వస్తున్నా కనీసం ఆహారం పెట్టలేని దుస్థితిలో రాజన్న ఆలయ అధికారులు, ఈ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు.
ఆహారం లేక మృతి చెందితే అధికారులు, నాయకులకు కనీస మానవత్వం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాజన్న కోడెలకు ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నారు? ఏమైనా వైద్య సదుపాయాలు కల్పించి మందులు కొనుగోలు చేశారా? ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. చనిపోయిన తర్వాత మాత్రమే అధికారులు హడావిడి చేస్తూ పంపిణీకి సిద్ధమవుతున్నట్టు కలెక్టర్ ప్రకటన చేశారని మండిపడ్డారు. గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా పకడ్బందీగా పంపిణీ జరగాలని సూచించారు.
ఇకపై రాజన్న కోడెలకు శాశ్వత పరిషారంగా 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి వాటిని కాపాడి భక్తుల మనోభావాలను గౌరవించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భక్తుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాజస్థాన్ ప్రాంతంలో రెండు వేల ఎకరాల్లో లక్షా 50వేల గోవులను సంరక్షిస్తున్నారని, అలాంటి ప్రదేశాలకు వెళ్లి అధ్యయనం చేసి కోడెలను కాపాడాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, క్రాంతి కుమార్, రామతీర్థపు రాజు, నరాల శేఖర్, సిరిగి రామచందర్, నిమ్మ శెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, గోలి మహేశ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, ఈర్లపల్లి రాజు, ముద్ర కోల వెంకటేశం, నరాల దేవేందర్, నీలం శేఖర్, హింగె కుమార్, మల్లేశం, రాజు, పోతు అనిల్, సందీప్ పాల్గొన్నారు.