వేములవాడ, మార్చి 12: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరీనంగర్లో మంగళవారం నిర్వహించే కదనభేరి సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కదిలిరావాలని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. సోమవారం వేములవాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో తమ గలం వినిపించాలంటే.. కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినో ద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సభకు ప్రతి మండలం నుంచి పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు.
సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, బండ నర్సయ్య, రామతీర్థపు రాజు, గడ్డం హన్మాండ్లు, మండలాధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, మల్యాల దేవయ్య, గోస్కు ల రవి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, జడ్పీటీసీ మ్యాకల రవి, సెస్ డైరెక్టర్ హరిచరణ్రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, కౌన్సిలర్లు విజయ్, గోలి మహేశ్, జోగిని శంకర్, గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్, నాయకులు భాస్కర్రావు, మహేశ్, ఆర్సీరా వు, కమలాకర్రెడ్డి, బూర బాబు, మహేశ్రెడ్డి, నరా ల దేవేందర్, వెంగళ శ్రీకాంత్గౌడ్, సత్యనారాయణరెడ్డి, సుంకపాక రాజు, అరుణ్, సాయి ఉన్నారు.
ముస్తాబాద్/వేములవాడ రూరల్/ సిరిసిల్ల రూరల్/ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల టౌన్, మార్చి 11: కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే కదనభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడి పిలుపునిచ్చారు. సోమవారం వారు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు శీలం స్వా మి, బీఆర్ఎస్ నేతలు మెంగాని మనోహర్, అన్వర్, సడిమేల ఎల్లం, కంచం