HomeKarimnagarChairman Konduri Ravinder Rao Stated That Telangana Is Advancing In All Fields And Continues To Be At The Top In The Country
అన్ని రంగాల్లో మనమే టాప్
పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని, దేశంలోనే టాప్లో కొనసాగుతున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. దశాబ్దాలపాటు కొట్లాడి సాధించిన రాష్ట్రంలో తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనతో సమగ్రాభివృద్ధిని స్వాగతిస్తూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
తొమ్మిదేండ్లలోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధించాం
ప్రగతిని స్వాగతిస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి
నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
గంభీరావుపేట, జూన్ 24: పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని, దేశంలోనే టాప్లో కొనసాగుతున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. దశాబ్దాలపాటు కొట్లాడి సాధించిన రాష్ట్రంలో తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనతో సమగ్రాభివృద్ధిని స్వాగతిస్తూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గంభీరావుపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో శనివారం విలేకరులతో కొండూరి మాట్లాడారు. అందరం ఆశ్చర్యపడేలా అవతరణ దినోత్సవాలను 20 రోజుల పాటు నిర్వహించుకుని స్ఫూర్తిని చాటామన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో సహకార వ్యవస్థ తొమ్మిదేండ్లలో పదింతల అభివృద్ధి జరిగిందన్నారు. 2014కు పూర్వం కరీంనగర్ సహకార సంఘాల్లో రూ.600 కోట్ల లావాదేవీలు ఉండగా, ప్రస్తుతం రూ.6వేల కోట్లకు చేరుకున్నదని చెప్పారు.
కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు. బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో మెట్ట ప్రాంతానికి కాళేశ్వరం జలాలు తరలించారని, ఎర్రటి ఎండల్లో ఎగువ మానేరుకు నీళ్లు తీసుకరావడంతో మత్తడి దూకిందన్నారు. గతంలో ఎప్పుడో ఒకసారి మానేరు ఆయకట్టు కింద పంటలు పండేవని, అందులోనూ చివరికి సరిపడా నీరందక పంట చేతికి వచ్చేదికాదని గుర్తుచేశారు. ప్రస్తుతం తైబందు లేకుండా చివరి ఆయకట్టుకూ పుష్కలంగా నీరందిస్తున్నామని వివరించారు. వర్షాలతో సంబంధం లేకుండా ఆరుద్ర కార్తెలో సైతం వానాకాలం పంటలకు నీరందించేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో వెయ్యి గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఒక్కో విద్యార్థిపై రూ.1.50లక్షలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ రోజు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో టాప్ పది ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే వస్తుండడం ప్రభుత్వం చేస్తున్న విద్యాభివృద్ధికి నిదర్శనమన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో రాష్ట్రంలో ఆదర్శంగా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని, అందులో అడ్మిషన్లు పొందడానికి ఇతర జిల్లాల విద్యార్థులు పోటీ పడుతున్నారన్నారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ను చేసిన అభివృద్ధిని స్వాగతిస్తూ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఇక్కడ పార్టీ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, జడ్పీకోఆప్షన్ సభ్యుడు అహ్మద్, వైస్ ఎంపీపీ దోసల లత, ఉప సర్పంచ్ సింగారపు నాగరాజుగౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ రామాంజగౌడ్, నేతలు పెద్దవేని వెంకటియాదవ్, కమ్మరి రాజారాం, రెడ్డిమల్ల రాజనర్సు, దేవేందర్, వహీద్, గోగు లింగంయాదవ్, చారి, రాజు, సందీప్, వేణు, శ్రీనివాస్, శీల రమేశ్, ఎగదండి స్వామి, కిషోర్, ధన్రాజ్, శ్రీశైలం, కుతుబ్ ఉన్నారు.