Godavarikhani | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడీకే-11 గనిని ఆదివారం సాయంత్రం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్ పర్సన్ కిషోర్ మాక్వనా, సభ్యులు వడ్డేపల్లి రాం చందర్ లవకుష్ కుమార్, సెక్రెటరీ ఐఏఎస్ అధికారి గూడె శ్రీనివాస్ సందర్శించారు. గోదావరిఖని పట్టణంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సోదరుడి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు సింగరేణి గనిని సందర్శించడానికి విచ్చేశారు. కాగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ ఇతర సభ్యులు అధికారులకు సింగరేణి యాజమాన్యం రామగుండం డివిజన్ వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఘన స్వాగతం పలికారు. గని లోపల యాంత్రికరణ పద్ధతులు ఇతర సాంకేతికతను వారికి అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు సంబంధించిన పలు అంశాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులకు తెలియజేశారు.