మెట్పల్లి, నవంబర్ 23: ఒంటరిగా రోడ్డుపై ఆటో కోసం వేచి ఉన్న ఓ వృద్ధ్దురాలికి లిప్ట్ ఇస్తామని చెప్పి ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి పట్టణంలో జరిగింది. మెట్పల్లి పోలీస్స్టేషన్లో బుధవారం రాత్రి వివరాలను మెట్పల్లి ఇన్చార్జి సీఐ రాజశేఖర్రాజు వెల్లడించారు. కథలాపూర్కు చెంది న వృద్ధురాలు పులికంత నాగమణి (65) మెట్పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో గల వీఆర్ఎం గార్డెన్లో తమ బంధువుల శుభకార్యానికి హాజరై తిరిగి రాత్రి సుమారు 8 గంటల ప్రాం తంలో రోడ్డుపైకి వచ్చి ఆటో కోసం ఎదురు చూ స్తుండగా గుర్తు తెలియని ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చారు.
మెట్పల్లి బస్టాండులో దింపుతామని మాయమాటలు చెప్పి నమ్మించి అమెను బైక్పై ఎక్కించుకున్నారు. కొంత దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో బైక్ను ఆపి దాడి చేసి ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని బైక్పై మెట్పల్లి వైపు పరారయ్యారు. బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ సధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చేపట్టారు. బాధితురాలు చెప్పిన ఆనవాళ్లు, స్థానికుల ఇచ్చిన సమాచారంతో దొంగతనానికి పాల్పడింది మెట్ల చిట్టాపూర్కు చెందిన కుంచపు ఓదయ్యగా గుర్తించి ఆదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి తులన్నర బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. వృద్ధ్దురాలిపై దాడి చేసి దొంగతనానికి పాల్పడిన ఓదయ్యను ఆరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.