వేములవాడ, ఆగస్టు 31: ప్రజాసమస్యల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు చెన్నమనేని రాజేశ్వర్రావు అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్లాఘించారు. ఆయన బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. ఆయన చేసిన ఉద్యమాలు ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చియాని చెప్పారు. వ్యవసాయరంగ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ఎమ్మెల్యే రమేశ్బాబు ఆధ్వర్యంలో గురువారం వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో రాజేశ్వరరావు శతజయంత్యుత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వి నోద్కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి మం త్రి కొప్పల హాజరయ్యారు. రాజేశ్వర్రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. చెన్నమనేని జీవిత విశేషాలపై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాజేశ్వర్రావు కమ్యూనిస్టు నేతగా, గొప్ప మేధావిగా రాష్ట్ర, జాతీయస్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు.
ఉన్నత సామాజికవర్గంలో జన్మించి పీడితుల అభ్యున్నతికి కృషి చేశారని, వారి కోసం జైలు జీవితం కూడా గడిపారని గుర్తుచేసుకున్నారు. చెన్నమనేని కుటుంబం చాలా గొప్పదని చెన్నమనేని రాజేశ్వర్ రావు, విద్యాసాగర్రావు, హనుమంతరావు లాంటి నాయకులు ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చికాల రామారావు, జనశక్తి అగ్ర నేత కూర రాజన్న, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మాజీ మార్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు బూర వజ్రమ్మ, బైరగోని లావణ్య, గంగం స్వరూపారాణి, రేవతి, చంద్రయ్య గౌడ్, జెడ్పీటీసీలు మ్యాకల రవి, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, పార్టీ అధ్యక్షులు పులం రాజు, గోసుల రవి, మల్యాల దేవయ్య, మ్యాకల ఎల్లయ్య, సెస్ డైరెకర్లు నామాల ఉమా, రేగులపాటి హరిచరణ్రావు, ఆకుల దేవరాజు, ఆ కుల గంగారం, పొన్నాల శ్రీనివాసరావు, నాయకులు రామతీర్థపు రాజు, పొలాస నరేందర్, కం దుల క్రాంతికుమార్, సలీం, మాడిశెట్టి కృపాల్, నామాల లక్ష్మీరాజం, కోయినేని శ్రీనివాస్, పీర్ మహమ్మద్, పీచర భాసర్ రావు, ప్రసాద్ రావు, మల్లేశం, నరాల దేవేందర్, జడల శ్రీనివాస్, పెం టబాబు, రాము, ముద్రకోల వెంకటేశం, హింగే కుమార్ తదితరులున్నారు.
గోదావరి జలాలను ఎత్తిపోసి బీడు భూములను సస్యశ్యామలంగా మార్చాలని 50 ఏళ్ల క్రితమే కలగన్న గొప్ప నాయకుడు చెన్నమనేని రాజేశ్వర్రావు. నీటి వనరులు లేని వర్షాభావం తకువగా ఉన్న మెట్పల్లి, సిరిసిల్ల, హుస్నాబాద్, ఆలేరు, జనగామ, నల్లగొండ వరకు గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారానే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని ఆయన ఆనాడే చెప్పారు. నైజాం, జమీందార్ల పాలన వ్యతిరేకంగా చిన్నతనంలోనే పేదల పక్షానా పోరాడిన గొప్ప నాయకుడు.
– బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
బలహీన వర్గానికి చెందిన నాకు లోక్సభలో అడుగుపెట్టే అవకాశం ఆ రోజుల్లో రావడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి చెన్నమనేని రాజేశ్వర్ రావు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ
చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్యాకేజీ 9కు పేరు పెట్టడం మా నాన్నగారికి దక్కిన అరుదైన గౌరవం. ఎత్తిపోతల ద్వారా ఈ బీడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనుకున్న మా నాన్న కలను సీఎం కేసీఆర్ సాకారం చేయడమే కాకుండా ఆయన పేరు పెట్టడం అన్ని వర్గాల ప్రజల్లో సంతోషాన్ని నింపింది. కేంద్రం రాజేశ్వరరావు పేరిట పోస్టల్ స్టాంపులు కూడా ముద్రించనుంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలను పుస్తక రూపంలో ముద్రించాం. పోస్టల్ స్టాంప్తో కలిపి అక్టోబర్లో హైదరాబాద్లో ఆవిషరిస్తాం.
– చెన్నమనేని రమేశ్ బాబు, వేములవాడ ఎమ్మెల్యే, వ్యవసాయ రంగ ప్రభుత్వ ప్రధాన సలహాదారు
మల్యాల, ఆగస్టు 31: శ్రావణ పౌర్ణమి సం దర్భంగా కొండగట్టు ఆలయ పరిసరాల చు ట్టూ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. చిలుకూరు వేంకటే శ్వరస్వామి ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహారాజ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కొండగట్టు దిగువన ఉన్న హనుమాన్ విగ్రహం నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ పాదయాత్ర.. దొంగలమర్రి, నాచుపల్లి క్రాస్రోడ్, డబ్బుతిమ్మయ్యపల్లి, రాంసాగర్, మద్దు ట్ల, రామన్నపేట, నూకపల్లి, మల్యాల ఎక్స్రోడ్ మీదుగా 25 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా ఆత్మరాం సురేశ్ మాట్లాడు తూ, మహిమాన్వితమైన ఈ కొండచుట్టూ గిరిప్రదక్షిణ చేయడం వల్ల సహజసిద్ధమైన ఔషధ మూలికలతో కూడిన ప్రాణవాయువు లభించి మరింత ఉత్తేజం కలుగుతుందన్నారు.
వెల్గటూర్, ఆగస్టు31: ధూపదీప నైవేద్య అ ర్చకులకు రూ.10వేల గౌరవ వేతనం పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. కిషన్రావ్పేట నాగవెల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు గురువారం సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాల తో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. రా ష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలననే కొనసాగాలని ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ చైర్మన్ నైనాల అజయ్, కోశాధికారి కు మ్మరి వెంకటేశ్, సభ్యులు రామచంద్రరావ్, శ్రీనివాస్, శేఖర్, చిరంజీవి ఉన్నారు.