‘ఈద్-ఉల్-ఫితర్’ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ఆరంభం నుంచి కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం ముగియడంతో శనివారం పండుగను జరుపుకున్నారు. ఉదయమే కొత్త బట్టలు, అత్తరు పరిమళాలతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకుని సామూహిక ప్రార్థనలు చేయగా, మత పెద్దలు సందేశమిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అలయ్బలయ్ తీసుకుని శుభాకాంక్షలు చెప్పారు.
– కమాన్చౌరస్తా, ఏప్రిల్ 22
కరీం‘నగరం’ శివారులోని సాలెహ్నగర్ ఈద్గా వద్ద వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హుజూరాబాద్లోని ఈద్గా మైదానంలో ముస్లింలకు ఎమ్మెల్సీ, మండలి విప్ కౌశిక్రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. గంగాధర మండలం నారాయణపూర్ సర్పంచ్ ఎండీ నజీర్ గృహంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేశారు. మానకొండూర్లోని ఈద్గా వద్ద ముస్లింలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ శుభాకాంక్షలు తెలిపారు.