CCTV Cameras | గంగాధర, మార్చి 20 : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై వంశీకృష్ణ సూచించారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి లో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలను కాపాడడానికి సీసీ కెమెరాలు అవసరమని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం సులభమవుతుందని తెలిపారు.
ప్రజల భద్రతను కాపాడడంలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేర సంఘటనలు జరిగినప్పుడు దర్యాప్తుకు సీసీ కెమెరాలు ఉపయుక్తంగా ఉంటాయని వివరించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ గ్రామ భద్రతను కాపాడేందుకు ముందుకు రావాలని సూచించారు. సీసీ కెమెరాల నిర్వహణను సక్రమంగా కొనసాగిస్తూ, వాటి ద్వారా గ్రామంలో శాంతి భద్రతలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోల మమతారాణి శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.