Iddulapur | కాల్వశ్రీరాంపూర్, జూన్ 26 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మామిడి లత అశోక్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, ఉప సర్పంచ్ హరీష్, నాయకులు శివరామకృష్ణ, రాజయ్య ,మొగిలి, సదయ్య, కొమురయ్య, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.