విద్యానగర్, సెప్టెంబర్ 28 : భారతదేశంలో అధిక శాతం మరణాలకు గుండె జబ్బులు కారణమవుతున్నాయి. నిజానికి హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ట్స్, ఇతర రకాల గుండె జబ్బులకు వయసుతో పెద్ద సంబంధం లేదు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ముఖ్య కారణమవుతున్నప్పటికీ ఇందులో కొన్ని కారణాలు..
తగినంత నిద్ర లేకపోతే ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు. అయినప్పటికీ చాలా మంది ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించరు. ప్రస్తుత జీవన శైలి, పని ఒత్తిడి వల్ల ప్రాధాన్యత జాబితాలో నిద్ర అనేది లేకుండా పోతుంది. నిద్రలేమి వల్ల కలుగుతున్న అనర్థాల వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంది. మరీ ముఖ్యంగా మన శరీరం, మెదడుపై అది చూపించే దుష్పరిణామాల గురించి తెలిసింది తక్కువ మందికి. అధ్యయనాలు చూపే దాని ప్రకారం మరీ తక్కువ లేదంటే మరి ఎక్కువగా నిద్ర పోవడమన్నది కార్డియోవాస్క్యులర్ రోగాలకు దారి తీస్తుంది. వ్యక్తిగతంగా పనితీరు మెరుగుపరుచుకోడానికి రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్ర పోవాలి.
గాలి కాలుష్యమనేది ఊపిరితిత్తులకు మంచిది కాదు. కానీ కాలుష్యమైన గాలిని స్పల్పకాలం పీల్చిన అది శరీరంపై ఒత్తిడి పెంచుతుంది. గాలి కాలుష్యం అనేది అత్యంత భయంకరమైనది. ఇది అధికరక్తపోటు, మధుమేహం, గుం డె జబ్బులు, స్ట్రోక్కు కారణమవుతుంది. గాలి కాలుష్యం కారణంగా మనం శ్వాసించే విష పదార్థాలు హార్ట్ ఎటాక్స్కు క్రమరహితమైన గుండె లయకు కారణమవుతాయి. మరీ ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులున్నా, లేదంటే ఆ ప్ర మాద ఛాయలు దగ్గరగా ఉన్నా ఇది మరింత తీవ్రతరం చే స్తాయి. సాధారణ గాలి కాలుష్యం గుండె, ఊపిరితిత్తులు మాత్రమే కాదు. నిద్ర నాణ్యతపై కూడా ప్రభా వం చూపుతుంది. గాలి నాణ్యత మెరుగుపరచడం వల్ల ఆరోగ్యకరమై న నిద్ర కలగడంతో పాటు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
ఒత్తిడి స్థాయి తగ్గించుకుంటే అది సానుకూల ప్రభావం చూపుతుంది. రక్తపోటు తగ్గడం, కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉండడంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. ఒత్తిడితోనే నేరుగా హార్ట్ ఎటాక్ రావడం అంటూ ఉండదు. కానీ స్ట్రెస్ కార్డియోమియోపతి లాంటి స్థితికి కారణం కావచ్చు. స్ట్రెస్ కార్డియోమియోపతి అనేది నిర్ధారించని ఆరోగ్య స్థితిగా చెప్పవచ్చు. ఇది హార్ట్ ఎటాక్ లాగానే లక్షణాలను చూపుతుంది. కానీ ఈ కేసులో గుండె శాశ్వతంగా నష్టపోదు. స్ట్రెస్ కార్డియోమియోపతి అనేది ఆర్టెరీ బ్లాకేజీల వల్ల ఏర్పడదు. స్ట్రెస్ కార్డియోమియోపతి అనేది రోగులకు గుండె నీరసం అనేది కొద్ది వారాల్లోనే తగ్గుతుంది.
ఏటా దేశ వ్యాప్తంగా అత్యధిక మరణాలు గుండె జబ్బుల వల్లే సంభవిస్తున్నాయి. గుండె జబ్బే నంబర్ వన్ కిల్లర్. గుండెపోటు రావడానికి పొగాకు వినియోగం ముఖ్య కారణం. బీపీ, షుగర్, ఉద్యోగ, వ్యాపార ఇతర కారణాలతో వచ్చే మానసిక ఒత్తిడి శారీరక వ్యాయామం లేకపోవడం, మద్యం తాగడం, అన్ హెల్త్ డైట్ తీసుకోవడం ప్రధాన కారణాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 15 మంది హార్ట్ స్పెషలిస్టులున్నారు. 40 నుంచి 80 మంది వరకు గుండె జబ్బు వైద్యం కోసం వస్తుంటారు. ఛాతిలో నొప్పి ప్రారంభమైన గంటకు అది గుండెపోటని గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శుక్రవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వాక్ ఇయర్ థాన్ కార్యక్రమం ఉంటుందని కరీంనగర్ రెనె దవాఖాన నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. రెనె హాస్పిటల్లో ప్రారంభమై కోర్టు చౌరస్తా నుంచి తెలంగాణచౌక్ వరకు, అక్కడి నుంచి రెనె హాస్పిటల్కు చేరుకుంటుందన్నారు. కాగా, తమ దవాఖాన ఉత్తర తెలంగాణలో అధునాతన హార్ట్ సర్జరీలకు ప్రసిద్ధిగాంచిందని, తమ హాస్పిటల్లో సకల సౌకర్యాలతో కార్డియోథొరాసిక్, వాసులర్ సర్జికల్ విభాగం ఉన్నదని తెలిపారు. గుండె-ఊపిరితిత్తుల యంత్రం, ట్రాన్స్-ఎసోఫాగియల్ ఎకో ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్తో సహా సరికొత్త పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల్లో సంక్లిష్టమైన పుట్టుకతో వచ్చే గుండెలో రంధ్రాలు, ఇతర వైకల్యాలు, పెద్దల్లో వాల్యులర్ గుండె జబ్బుల కోసం వాల్వ్ రీప్లేస్ మెంట్ చేసే అవకాశం ఉన్నదని, 1.5 కిలోలు 1.7 కిలోల బరువు కలిగి వారం కంటే తకువ వయసున్న పిల్లలకు ఆపరేషన్ చేసినట్లు వివరించారు. 75 ఏండ్లు పైబడినవారికి కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీలను విజయవంతం చేసినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ గుండె వ్యాధుల గురించి అవగాహన పెంపొందించుకోవాలి. ధూమ, మద్యపానానికి అలవాటు పడటం వల్ల 25 నుంచి 30 ఏళ్ల యువతపైనే గుండె ప్రభావం ఎక్కువగా ఉంది. తక్కువగా కొవ్వు పదార్థాలు, ఆకుకూరలు, పండ్లు, తినడంతో గుండె పనితీరును సక్రమంగా చేసుకోవచ్చు. బీపీ, షుగర్, కొవ్వును అదుపులో ఉంచుకోవాలి. శారీరక వ్యాయామం రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజులు తప్పకుండా చేయాలి. గుండె వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ దినాకర్ తాటిమట్ల, రెనె హాస్పిటల్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్టు
జీవన శైలిలో మార్పులతో యువకుల్లోనే ఎక్కువగా గుండె వ్యాధులు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం అధిక మొత్తంలో కొవ్వు, జన్యుపరమైన కారణాలు. వీటితో పాటు బీపీ, షుగర్ ఉన్నా గుండె పోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండె వ్యాధి లక్షణాలు కన్పించగానే దగ్గరలోని దవాఖానకు తరలిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. గంటలోపే తరలిస్తే అది గోల్డెన్ అవర్గా ఎంతో ఉపయోగం.
– డాక్టర్ యూసుఫ్ మహ్మద్ రఫీ, డీఎన్బీ జనరల్ సర్జరీ, రెనె హాస్పిటల్
నవజాత శిశువుల్లో సంక్లిష్టమైన పుట్టుకతో వచ్చే పీడియాట్రిక్ రుగ్మతల గురించి (గుండెలో రంధ్రాలు, ఇతర వైకల్యాలు) ప్రాథమిక దశలో గుర్తించాలి. చిన్నప్పుడే శస్త్ర చికిత్సలు చేస్తే పూర్తిగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండెలో నిరోధించబడిన ధమనుల కోసం కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీలు, పెద్ద వాళ్లలో వాల్యులర్ గుండె జబ్బుల కోసం వాల్ రీప్లేస్మెంట్ల వరకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 1.5 కిలోలు, 1.7 కిలోల బరువున్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు విజయవంతం చేశాం. కరీంనగర్లోనే పూర్తి స్థాయిలో గుండె సంబంధిత వ్యాధులకు పూర్తి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ రాజ విజయేంద్రరెడ్డి, పిల్లల, పెద్దల ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్టు, రెనె హాస్పిటల్