మారుతీనగర్, అక్టోబర్, 20 : ‘ఎన్నికలు వస్తున్నాయని మీ వద్దకు వచ్చి ఏదేదో మాట్లాడే ప్రతిపక్షాల మాటలతో ఆగం కావద్దు. వాళ్లు నోటికి ఏదొస్తే అది చెబుతరు. సాధ్యంకాని హామీలు ఇస్తరు. వాళ్లతో అయ్యేది లేదు. పోయేది లేదు. ఒకసారి ఆలోచించండి. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించి, ఆశీర్వదించండి’ అని కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోతే గోసపడుతరని చెప్పారు.
శుక్రవారం మెట్పల్లి పట్టణ శివారులోని అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావుతో కలిసి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి పట్టణంలోని వ్యాపార సముదాయాల్లో ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాలతో వ్యాపారస్తులను కలిశారు. పథకాలను చూసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ అందజేస్తున్న సంక్షేమ ఫలాలు, మహిళలు ఆర్థికాభివృద్దికి, వృద్ధులకు పింఛన్లు అందుతున్నాయా..? లేదా..? అని పలువురు వ్యాపారులను అడుగుతూ ముం దుకుసాగారు.
తనను ఆశీర్వదించి గెలిపించాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, దసరా పండుగతో రద్దీగా ఉన్న వ్యాపార సముదాయాలలో యువ నాయకుడు ప్రచారం చేస్తుండగా, యువతీ యువకు లు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ఇక్క డ మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర్రావు, ఎంపీపీ మారు సాయిరెడ్డి, కౌన్సిలర్లు ఒజ్జెల బుచ్చిరెడ్డి, కిషోర్, పురుషోత్తం,జియా, బీఆర్ఎస్ నాయకులు రాణవేని సత్యనారాయణ, వేముల ప్రభాకర్, తిరుసుల్లా అర్జున్, మర్రి సహదేవ్, లింగంపల్లి సంజీవ్, శ్రీనివాస్, ప్రణయ్, శ్యాం, తీగల లింగారెడ్డి, రాయల్, ఎండీ జావీద్, పాల్గొన్నారు.