కార్పొరేషన్, జనవరి 24: కరీంనగర్లో ఈనెల 24న జరిగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 24న జరిగే సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. సమావేశానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారని ఎమ్మెల్యే తెలిపారు.
అలాగే కరీంనగర్ అసెంబ్లీ నుంచి 300 మంది, ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 150 నుంచి 200 మంది సోషల్ మీడియా కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. నగరంలోని రాజశ్రీ గార్డెన్లో సమావేశం నిర్వహిస్తామని, కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీ వినోద్కుమార్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.