జగిత్యాల, ఏప్రిల్ 9: జగిత్యాలకు చెందిన సీనియర్ న్యాయవాది మాకునూరు హనుమంతరావు గత నెల 29న అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన కుమారుడు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో బుధవారం నిర్వహించే 13వ రోజు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. హనుమంతరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించనున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.