వీణవంక, మార్చి 28: రానున్న వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని.. ప్రజలు సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆకాంక్షించారు. గురువారం మండలంలోని మామిడాలపల్లిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఎంతో వ్యయంతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నిర్మించడం హర్షించదగిన విషయమన్నారు. రానున్న రోజుల్లో మామిడాలపల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రహరీ నిర్మాణానికి రూ.50 వేలు అందజేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రకటించారు.
అనంతరం వారు వల్భాపూర్లో సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విలువైన చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అలాగే చల్లూరులో ఎంపీటీసీ ఎలవేన సవిత-మల్లయ్య కూతురు వివాహానికి, రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్రావు, ఎంపీటీసీలు మూల రజిత-పుల్లారెడ్డి, దేవేందర్, మాజీ సర్పంచులు బండ సుజాత-కిషన్రెడ్డి, పోతుల నర్సయ్య, రఘుపాల్రెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ కామిడి కావ్య-శ్రీనివాస్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్, రాజమౌళి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శంకరపట్నం, మార్చి 28: మొలంగూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ వేర్వేరుగా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వారి వెంట జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ గుర్రాల తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, నాయకుడు సతీశ్రెడ్డి పాల్గొన్నారు.