మంథని రూరల్, నవంబర్ 28: ఆలోచన చేయకుండా కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ కనుమరుగవుతుందని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని లక్కెపూర్లో ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్సోళ్లు మాత్రం మూడు గంటల కరెంటు ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. 10హెచ్పీ మోటర్ పెట్టుకుంటే గంటలో ఎకరం నీళ్లు పారుతాయని లెకలు వేస్తున్నారని ఆయన తెలిపారు.
24గంటల కరెంటు కావాలో మూడు గంటల కరెంటు కావాలో రైతులు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్పుడు ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్ట డం, కరెంటు కోసం సబ్ స్టేషన్ ల వద్ద ధర్నాలు చేసిన సంఘటనలు మర్చిపోవద్దన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేండ్ల పాలన, పదేండ్ల ముందు కాంగ్రెస్ పాలనపై బేరీజు వేసుకోవాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా ఉండి చేసిన పనులను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పనితీరును గమనించాలని సూచించారు.
ఎన్నికలు వచ్చాయంటే నాయకులు వస్తారు అనేకం చెప్తుంటారని, అందులో ని జాలేవి, అబద్ధాలేంటో ఆలోచన చేయాలన్నా రు. ఎవరో ఆగం చేస్తే ఆగమైపోతే మ ళ్లా ఐదేండ్లు మనం గోసపడక తప్పదన్నారు. ఇప్పుడు మనం వేసే ఓటు ఐదేండ్ల మన భవిష్యత్ను నిర్ణయిస్తుందన్నారు. ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే మంథ ని ఎమ్మెల్యే పార్టీలు మారే విజయశాంతిని తీసుకువచ్చారని, ఆమె ఏ పార్టీలో ఉంటుందో ఆమెకే తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్లో సీఎం అయ్యేదోవరో తెలి యదని. ఆపార్టీని ఆదరిస్తే ఆగమ్యగోచరమేనని అ న్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను సీఎం కేసీఆర్ అద్భుతంగా తయారు చేశారని, రైతుబీ మా తరహాలో కేసీఆర్ బీమా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పారు.
అదే విధంగా ప్ర తి గృహిణికి మూడు వేలు, పెట్టుబడిసాయం, ఆసరా పింఛన్ల పెంచుతామన్నారు. ఈ పథకాల తో పాటుతాను పుట్ట లింగమ్మట్రస్టు ద్వారా సేవ లు అందిస్తానన్నారు. ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి ద్వారా ఇల్లు మంజూరీ చేయి ంచి ప్రభుత్వం మూడు లక్షలతో పాటు తాను కొంత సాయం చేసి దగ్గరుండి ఇళ్లు నిర్మించి ఇస్తానని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వచ్చే సర్పంచ్ ఎన్నికలు తోటగోపయ్యపల్లిలోనే జరుగుతాయని తెలిపారు. నాలుగేండ్లలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి, సేవలు మీ కళ్ల ముం దే ఉన్నాయని, మళ్లీ ఆదరించి ఆశీర్వదిస్తే మీ కు టుంబసభ్యుడిలా ఐదేండ్లు సేవ చేస్తానని చెప్పా రు. కార్యక్రమంలో నాయకులు మిట్ట సత్యనారాయణ, కొత్త శ్రీనివాస్, కిష్టయ్య, ఏగోళపు శంకర్ గౌడ్, తిరుపతి, రవీందర్ ఉన్నారు.