అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ గురువారం పర్యవేక్షించారు. తంగళ్లపల్లి, జిల్లెల్ల, సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలిక ఉన్నత పాఠశాల, కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయాచోట్ల కేంద్రాలకు వెళ్తూ ప్రజలను పలుకరించారు.
సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్, నవంబర్30: సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ గురువారం పోలింగ్ సరళిని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. మొదట హైదరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నా రు. తర్వాత తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పోలింగ్ కేంద్రం తో పాటు సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ బాలికల ఉన్నత పాఠశాల, కుసుమ రామయ్య పాఠశాలలో ఏర్పాటు పోలింగ్ కేంద్రాలను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అక్కడే ఉన్న ఓటర్లతో మాట్లాడారు.
కేటీఆర్ పోలింగ్ కేంద్రానికి రావడంతో ఓటర్లలో ఉత్సాహం కనిపించింది. తర్వాత తంగళ్లపల్లికి చేరుకుని స్థానిక నేతలతో మాట్లాడారు. పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. అందరూ ఓటేశారా అంటూ పలుకరించారు. తంగళ్లపల్లిలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న పోలింగ్ బూత్ వద్ద ఉన్న బీఆర్ఎస్ యూత్ లీడర్లతో మాట్లాడి, వారితో పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగి ఉత్సాహపర్చారు.
తర్వాత సిరిసిల్లకు పయనమయ్యారు. ఆయా కార్యక్రమాల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్ట ణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ఎంపీపీ పడిగెల మానస, మండ లాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, సర్పంచ్ అంకారపు అనిత, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షు డు చెన్నమనేని వెంకట్రావు, ఎంపీటీసీ కోడి అంతయ్య, నాయకులు అంకారపు రవీందర్, పెద్దూరి తిరుపతి, ఎగుమామిడి వెంకటరమణా రెడ్డి, బండి జగన్, జగత్, అనిల్గౌడ్ బొల్లి రామ్మోహన్, అన్నల్ దాస్ వేణు, సుంకపాక మనోజ్ తదితరులు ఉన్నారు.