తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇటీవల జరిగిన సర్పంచుల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హామిని నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ ( Ravula Ramesh ) ప్రజలకు హామీ ఇచ్చారు.
మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ తిరుపతి గెలవగా ఆ గ్రామంలో వాటర్ కూలింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసి బుధవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. కేవలం మెయింటెన్స్ ఖర్చులు తీసుకుని కూల్ వాటర్ ( Cool Water ) గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలని గ్రామ పాలకవర్గానికి సూచించారు. మిగతా గ్రామాల్లో కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాట్ల తిరుపతి, ఉప సర్పంచ్ మేకల మహేష్, నాయకులు పాశం అశోక్ రెడ్డి, సమ్మయ్య, సతీష్, పరశురాములు, రవి, శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.