తిమ్మాపూర్, జూన్15 : బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై విసృ్తత స్థాయి సన్నాహక సమావేశం మంగళవారం అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనుండగా పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి రసమయి బాలకిషన్ పరిశీలించారు.
సమావేశం సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీశ్రావు, జీవన్రెడ్డి, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ అలుగునూర్ రస్తా, రాజీవ్ రహదారి పక్కన భారీగా ఫ్లెక్సీలు కట్టించారు. కాగా, సన్నాహక సమావేశానికి మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రసమయి పిలుపునిచ్చారు.