కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్పై నిరాధర ఆరోపణలు చేసినందుకు గాను మంగళవారం నగరంలోని కరీంనగర్ ఏసీపీకి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. వెంటనే తప్పుడు ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొన్నాళ్లు మతం పేరు మీద రాజకీయం చేశాడని, ప్రస్తుతం ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ప్రధాత కేసీఆర్ను దొంగ నోట్లు ముద్రించాడని చేసిన ఆరోపణను ఖండిస్తూ.. బండి సంజయ్ కుమార్ పై పట్టణ ఏసీపీకి ఫిర్యాదు చేశామన్నారు.
అదేవిధంగా బండి సంజయ్ చిల్లర మల్లర మాటలతో కరీంనగర్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇలాంటి వాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారని, కార్పొరేటర్ గా కూడా గెలవకుండా చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జి చుక్క శ్రీనివాస్ , నగర బీఆర్ఎస్వీ అధ్యక్షులు బొంకూరి మోహన్, నియోజక వర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, ఆరే రవి గౌడ్, వోడ్నాల రాజు, ఆఫ్రొజ్, సందీప్ వర్మ, కిరణ్ గౌడ్, అజయ్, సోహెల్, అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.