గంగాధర, మార్చి 29 : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి ప్రశంసించారు. మనమంతా కలిసికట్టుగా పనిచేసి వినోద్ను గెలుపించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన మళ్లీ గెలిస్తే ఢిల్లీలో ఏ ప్రభుత్వమున్నా కొట్లాడి నిధులు తెస్తారని, అభివృద్ధి చేస్తారని చెప్పారు.
గంగాధర మండలం బూరుగుపల్లిలో చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ యూత్, విద్యార్థి విభాగం అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వైపు యువత చూస్తున్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నదన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం మోసపోయి బండి సంజయ్కి ఓటు వేస్తే నియోజకవర్గ అభివృద్ధికి నయాపైసా తేలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆరు మోసాలని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ ద్యావ మధుసూదన్రెడ్డి, పార్టీ యువజన విభాగం మండలాధ్యక్షుడు సుంకె అనిల్, నాయకులు రేగుల తిరుపతి, ఇరుగురాల రవి, లంక హరిబాబు, మామాడిపెల్లి అఖిల్, గుంటుకు ఆంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.