మానకొండూర్, జూన్ 26: ‘కాంగ్రెస్ అంటే స్కాంలు, గ్రూపులకు కేరాఫ్.. అలాంటి పార్టీ నా యకులు బీఆర్ఎస్ సర్కారు స్కీములపై విమర్శ లు చేయడం విడ్డూరం’ అంటూ బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఫైర్ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ సర్కారుపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాడని మండిపడ్డారు. మానకొండూర్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవ్వంపల్లి వైఖరిని ఎండగట్టారు. ఆయన ఇటీవల గంగిపల్లిలో చేసిన ఆరోపణలను ఖండించారు. 2014 కు ముందు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏలా ఉన్నది? ఇప్పుడు ఎట్లా ఉన్నది? తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులెంటి? తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు నిర్మించిం ది? తెలుసుకొని మాట్లాడాలని హితవుపలికారు. వారి హయాంలో ఎండకాలంలో ఎక్కడైనా చెరువులు, కుంటలు నిండే పరిస్థితి ఉండేదా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు భగ భగ మండే ఎండల్లో సైతం చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయంటే ఈ ఘనత ఎవరిదో చెప్పాలని ప్రశ్నించారు.
కాళేశ్వరం నిర్మాణంతోనే సాగు, తాగునీటి కష్టాలు దూరమయ్యాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంను మూడేండ్లలోనే నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. ఐటీ రంగం లో స్టార్టప్లకు అడ్డగా హైదరాబాద్ ఉండడం వా స్తవం కాదా? అని కాంగ్రెస్ నాయకులు చెప్పాలన్నారు. కుంభకోణాలకు నిలయమైన కాంగ్రెస్ ్టపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఊసరవెళ్లిలా పార్టీలు మార్చే కవ్వంపల్లికి ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. రెచ్చగొట్టె మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య అని దుయ్యబట్టారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను స్థానికేతరుడని అని పేర్కొనడం సరికాదన్నారు. స్థానికుడిని అని పదేపదే చెప్పుకునే కవ్వంపల్లిని నియోజకవర్గ ప్రజలు ఛీకొట్టి, రసమయిని రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గుండెల్లో పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మా ట్లాడాలని సూచించారు. కార్యక్రమంలో బీఅర్ఎస్వై నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్, ముంజంపల్లి, లలితాపూర్ సర్పంచులు రామంచ గోపాల్రెడ్డి, మర్రి కొండయ్య, నేతలు పిట్టల మ ధు, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్గౌడ్, నెల్లి శంకర్, ఇస్కుల్ల అంజి, పిండి సందీప్, గంజి శ్రీనివాస్, అనిల్, ఆంజనేయులు ఉన్నారు.