మెట్పల్లి/ కోరుట్ల/ కోరుట్ల రూరల్/ మేడిపల్లి/ఇబ్రహీంపట్నం, మే 6 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దారి పొడవునా ప్రజలు నీరాజనం పట్టారు.
జగిత్యాల నుంచి మొదలుకొని ఇబ్రహీంపట్నం మండలం వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరి కేసీఆర్ బస్సుపై పూల వర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, గజమాలలు వేసి స్వాగతించారు.