ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భూ కబ్జాదారులు వస్తున్నారని, దొంగలకు ఓటేసి ఆగం కావద్దని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఉదయం కరీంనగర్రూరల్ మండలంలోని చేగుర్తి, నల్లగుంటపల్లి గ్రామాల్లో ఇంటింటా ఓట్లు అభ్యర్థించారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్టీయూ అనుబంధ కార్మిక సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సాయంత్రం కరీంనగర్లోని 9, 11, 32 డివిజన్లలో ఇంటింటి ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ప్రజలు మంత్రికి నీరాజనం పట్టారు. మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. ఆయాచోట్ల మంత్రి గంగుల ప్రసంగించారు.
– కార్పొరేషన్/ కరీంనగర్రూరల్, నవంబర్ 4
కరీంనగర్ రూరల్, నవంబర్ 4: ‘కాంగ్రెస్కు అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియదు. అత్తగారింటికి వెళ్లి వచ్చినట్లు జైలుకు పోయే వ్యక్తికి.. దిక్కులేక టికెట్ ఇస్తుంది. భూకబ్జాదారుల నుంచి జాగ్రత్త.. చెరువులు మాయం చేస్తరు. ఇగ కరీంగనర్లో ఎంపీగా గెలిచిన వ్యక్తి ఒక్కసారైన మీ ఊరికి వచ్చిండా.. నయా పైసా అయిన అభివృద్ధి చేసిండా..? అలాంటి ఢిల్లీ పార్టీలకు.. ఓటు వేసి గోస పడద్దు’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ది టికెట్లు, బీ ఫాంలు అమ్ముకునే సంస్కృతి అని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు కేసీఆర్ కావాలని, ఢిల్లీ పార్టీల చేతిలో పెడితే, ఇతర రాష్ర్టాలకే లబ్ధి చేకూరుస్తారని, మన కోసం వాళ్లు పట్టించుకుంటారా..? ఓ సారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం కరీంనగర్ మండలంలోని చేగుర్తి, నల్లగుంటపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా గ్రామంలో గంగుల కమలాకర్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి, బతుకమ్మను ఎత్తుకుని, ఎన్నికల ప్రచారం చేశారు.
కాగా కాంగ్రెస్, బీజెపీ నాయకులు, యువకులు గంగుల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు. 2009, 2014, 2019లో వరుసగా గెలిపించి మీ గుండెల్లో పెట్టుకున్నారని, అలాంటింది నా సొంత గ్రామంగా చేగుర్తిని చూస్తూ వస్తున్నాని తెలిపారు. ప్రతి ఒక్కరీ అప్యాయతను మరువలేనని, బల్మూరి ఆనందరావు తన గెలుపునకు అహర్నిషలు కష్టపడ్డాడని, ఇప్పటికీ ఎక్కడున్న నాకు ఆయన ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. గ్రామంలో రోడ్లు వేశానని, చెక్డ్యామ్ నిర్మాణం చేయించానని గుర్తు చేశారు. తీగలగుట్టపల్లి నుంచి వల్లంపహడ్ మీదుగా గోపాల్పూర్, దుర్శేడ్, చేగుర్తి వరకు రోడ్డు వేశానని తెలిపారు. గత పాలనలో చేసిన అభివృద్ధి, ప్రస్తుతం తాను చేస్తున్న అభివృద్ధిని బేరీజు వేయాలన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సమైక్య పాలనలో సీఎంగా చేసిన కిరణ్కుమార్రెడ్డి ఇప్పుడు బీజేపీ ముసుగులో మళ్లీ వస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ టీపీ షర్మిలకు తెలంగాణతో ఏంపని అని ప్రశ్నించారు.
తెలంగాణలో పాదయాత్ర చేసి, కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నారని, మన సంపదను దోచుకుని, మళ్లీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను కలిపేందుకు కాంగ్రెస్, బీజేపీకి చెందిన సమైక్య వాదులు కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ పార్టీలని, వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకులు కావాలా..? మీ మధ్య ఉంటూ మీ తోనే తిరిగే మీ బిడ్డ లాంటి నేను కావాలా మీరే ఆలోచించుకోవాలన్నారు. విజ్ఞులైన మీరు తప్పు చేయకుండా కేసీఆర్, కారు గుర్తుకు ఓటు వేసి పచ్చని తెలంగాణ అభివృద్ధి చూడాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, సర్పంచులు చామనపల్లిఅరుణ, రాజయ్య, వడ్లూరి సంతోశ్, కిరణ్కుమార్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపీటీసీలు ఎల్కపల్లి స్వరూప, చంద్రమోహన్, మాజీ సర్పంచ్ బల్మూరి భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ గాండ్ల విజయ, అంజయ్య, సోసైటీ డైరెక్టర్ రమేశ్, గాండ్ల లక్ష్మీనారాయణ, యూత్ మండలాధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, బుర్ర తిరుపతి గౌడ్, కందుల రమేశ్గౌడ్, అంజిరెడ్డి, రాజవ్వ, పార్టీ గ్రామాధ్యక్షుడు గాండ్ల కొమురయ్య, సతీశ్, కార్పొరేటర్ల జంగిలి సాగర్, తుల బాలయ్య, దాడి సుధాకర్, రాజేశ్వర్రావు, జక్కం నర్సయ్య, వేల్పుల నారాయణ, సుంకిశాల సంపత్రావు, తొగరు మాల్లారెడ్డి, రాజు, కొమురయ్య, సురేందర్, శంకరయ్య, సంపత్, శ్రవణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.