వెల్గటూర్/ వెల్గటూర్, ఏప్రిల్ 11: ముస్లింలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రంజాన్ పండుగ సందర్భంగా కనీసం తోఫాలు కూడా ఇవ్వరా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని, నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని మతాలను సమానంగా చూసి, ముస్లింలకు పెద్దపీట వేసి, అండగా నిలిచిన గొప్ప నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
ఆయన ఆదేశాల మేరకు పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం వెల్గటూర్ మండలం శాఖాపూర్, గొల్లపల్లి మండలం చిల్వకొడూర్తోపాటు పెద్దపల్లిలోని చందపల్లిలో ముస్లింలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మతపెద్దలు కొప్పులకు దట్టి కట్టి, ఆశీర్వదించారు. అనంతరం ధర్మపురిలో విలేకరుల సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడారు. ముస్లింల అభ్యున్నతికి నిధులు కేటాయించడంతోపాటు ఇమామ్ల జీత, భత్యాలు పెంచిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు.
ఇంకా రంజాన్ మాసంలో ముస్లింలకు ‘తోపా’ అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ విస్మరించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రైతులకు సాగు నీరు ఇవ్వకుండా, రైతు బంధు, రుణమాఫీ, పంటకు రూ.500 బోనస్ హామీలను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో ఎక్కడ కూడా ఒక్క ఎకరం ఎండిపోకుండా నీళ్లందించామ ని, సంవత్సరానికి కోటి 20లక్షల ఎకరాల్లో పంటలు పండించుకున్నామని గుర్తుచేశారు.
కానీ, కాంగ్రెస్ పాలనలో సాగునీరందక యాసంగిలో పంటలు ఎండిపోతుయని ఆవేదన చెందారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 200కోట్ల నిధులను కాంగ్రెస్ సర్కారు రద్దు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మణ్కుమార్ తన ఆస్తుల గురించి మాట్లాడడం సరికాదని సూచించారు. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల లెక్క చెప్పానని, అవిగాక ఏమైనా ఉంటే ఆధారాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కౌన్సిలర్లు వేణు, యూనుస్, కార్తీక్ నాయకులు అయ్యోరి రాజేశ్కుమార్, చిలివేరి శ్యాంసుందర్, అక్కనపల్లి సునీల్కుమార్, సంగి శేఖర్, అనంతుల లక్ష్మ ణ్, దుర్గం రవి, అవునూరి శ్రీకాంత్, గడ్డం బాలరాజు తదితరులున్నారు.