రైతన్న లాభదాయక పంటల వైపు మళ్లించేందుకు రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో పట్టు సాగుపై దృష్టి పెట్టింది. ఈ సారి కరీంనగర్ జిల్లాలో అదనంగా 150 ఎకరాల్లో చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. ఈ దిశగా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నది.
ముకరంపుర (కరీంనగర్), జూలై 8: జిల్లాలో పట్టు పరిశ్రమను విస్తరించేలా అధికారులు కార్యాచరణను రూపొందించారు. మిగిలిన పంటలతో పోల్చితే పట్టు పురుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలోనే చేతికి అందే పంట. ప్రతి నెలా ఆదాయంతో రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం పట్టుసాగును ప్రోత్సహించేలా అన్నదాతలకు ప లు విధాలుగా రాయితీలు అందిస్తున్నది. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ఈ యేడాది లక్ష్యం 150ఎకరాలు
జిల్లాలో మల్బరీ సాగును మరింత విస్తరించే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 268ఎకరాల్లో సాగు చేస్తుండగా, ఈ ఏడాదికి గాను మరో 150 ఎకరాలు పెంచేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఆహార, వాణిజ్య పంట ల సాగుకు పెట్టుబడి ఖర్చుతో పాటు శ్రమ అధికంగా ఉంటుంది. నీటి వినియోగం ఎక్కువే. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించినా అంతంత మాత్రంగా వచ్చే దిగుబడితో రైతుల ఆ దాయంపై ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితుల్లో నెల రోజుల్లోనే పంట పూర్తయి, ఆదాయం చేతికొచ్చే పట్టు పరిశ్రమపై అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో పా టు పట్టు పురుగుల పెంపకంలో కీలకమైన మల్బ రీ తోటల పెంపకం, షెడ్ల నిర్మాణం, ఇతర విషయాలపై సమగ్రంగా వివరిస్తున్నారు. అధికారులు నిర్వహిస్తున్న సదస్సులకు రైతుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తున్నది. సంప్రదాయ పంట ల సాగు నుంచి పట్టుకు మరలడంపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 30ఎకరాల్లో కొత్తగా మల్బరీ సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చారు.
అందుబాటులో 60వేల మల్బరీ మొక్కలు
కొత్తగా పట్టు పరిశ్రమ చేపట్టబోయే రైతులకు అధికారులు అన్ని విధాలా అండగా నిలుస్తున్నా రు. సాంకేతిక అంశాలతో పాటు పంట చేతికొచ్చే వరకు ప్రతి దశను అవగాహన చేసుకుని సాగుపై పట్టు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. పట్టు పురుగుల పెంపకంలో మల్బరీ తోటల పెంపకం కీల కం. నాణ్యమైన ఆకు ద్వారానే మేలైన పట్టు గూ ళ్లను ఉత్పత్తి చేసే వీలుంటుంది. కొత్తగా సాగు చేసే రైతులు 100గుడ్లను పెంచేందుకు రెండెకరాల్లో మల్బరీ తోటను పెంచాల్సి ఉంటుంది. ఇందుకో సం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మల్బరీ విత్తన క్షే త్రంలో నాణ్యమైన మేలు రకానికి చెందిన 60 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచే రైతులకు మొక్కలు సరఫరా చేసేలా ఏర్పా ట్లు చేశారు. కొత్తగా పట్టు సాగు చేపట్టే రైతులు ప్రస్తుతం మల్బరీ మొక్కలు నాటితే సుమారు 3నెలల వ్యవధిలో తోటల ద్వారా ఆకు దిగుబడి వ స్తుంది. అప్పటి వరకు సెంట్రల్ సిల్క్ బోర్డు నిబంధనల మేరకు శాస్త్రీయ పద్ధతిలో పట్టుపురుగుల పెంపకం కోసం ప్రత్యేకంగా షెడ్డు నిర్మాణంతో పా టు అరలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
పట్టు పరిశ్రమ విస్తరణకు చర్యలు
జిల్లాలో పట్టు పరిశ్రమ విస్తరణకు కృషి చే స్తున్నాం. మిగిలిన పంటలతో పోల్చితే అతి త క్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో పంట చేతికి అందుతుంది. ఏడాదికి సుమారు 8పంటలు తీయవచ్చు. మంచి ఆదాయం కూడా ఉంటుం ది. పట్టు పురుగుల పెంపకం చేపట్టే రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెళకువలపై శాస్త్రీయంగా అవగాహన కల్పిస్తున్నాం. మార్కెటింగ్, ఇతర విషయాల్లోనూ అండగా ఉంటున్నాం.
– సింహాచలం యతీందర్, ఏడీ, సెరీకల్చర్