Odela | ఓదెల, ఆగస్టు 3 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో అంగన్వాడి ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. గ్రామంలో అంగన్వాడీ టీచర్లు, పిల్లలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడం వల్ల పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు.
పిల్లలకు డబ్బా పాలు తాగించకుండా తల్లిపాలను తాగించడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు సంపూర్ణ ఎదుగుదల ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం వల్ల పౌష్టిక ఆహారం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అఫ్రీన్, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, ఉమాదేవి, స్వరూప, సుమ, లావణ్య, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.