KalvaSrirampur | కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 3 : బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమైనవని కాల్వశ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ-1 కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులకు ముర్రుపాలు, తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు తప్పనిసరిగా పిల్లలను పంపించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో లభించే సేవలపై అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి సుధాకర్ , కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ హజీరా, తల్లులు పాల్గొన్నారు.