Sitarampur | చిగురుమామిడి, జూలై 19 : డప్పు చప్పులతో ఇంటింటా బోనాలతో మహిళలు పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. చిన్నారులు, పెద్దలు బాణాసంచా కాల్చుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని మహిళలు పోచమ్మ వద్ద నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల వేడుకను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని మహిళలు పేర్కొన్నారు.
నూతన వస్త్ర వేషాధారలతో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కుల రమణారెడ్డి, రెడ్డి సంఘం నాయకులు గోగురి మురహరి రెడ్డి, గోలి బాపిరెడ్డి, బేతి రాజిరెడ్డి, చామకూర సంపత్ రెడ్డి, ముస్కుల సుధాకర్ రెడ్డి, ముస్కుల రాజిరెడ్డి, ముస్కుల కృష్ణారెడ్డి, నాయకులు రాజిరెడ్డి, వేణుమాధవ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి, మాధవరెడ్డి,రాజిరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి, వెంకటరెడ్డి తో పాటు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.