సంబురాల సంక్రాంతి రానే వచ్చింది. నేటి నుంచి మూడురోజులపాటు వరుసగా బోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. సూర్యుడు దక్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి ప్రవేశించే సంక్రాంతికి ముందు రోజు వచ్చే బోగికి ప్రత్యేకత ఉంది.
ఇంట్లోని పాతవస్తువులను బోగి మంటల్లో దహనం చేస్తే పీడ తొలుగుతుందనీ, చిన్నారులకు బోగిపండ్లు పోస్తే దిష్టిపోతుందనే ఆచారం ఆనవాయితీగా వస్తున్నది.
– కరీంనగర్ కమాన్చౌరస్తా, జనవరి 13