కార్పొరేషన్, జనవరి 14: నగరంలోని 33వ డివిజన్లో గల మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో మేయర్ వై సునీల్రావు చేతుల మీదుగా చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేశారు. నగర ప్రజలకు మేయర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్కుమార్, ధన్రాజ్, బాలు, సాయి తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని గణేశ్నగర్లో పేద పిల్లలకు భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పతంగుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు అకినపల్లి నాగరాజు, సభ్యులు తాటిపల్లి సతీశ్బాబు, విజయప్రసాద్, పెద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు.
నగరంలోని 34వ డివిజన్ అంజనాద్రి కాలనీలో సంక్రాంతి పండుగను పురసరించుకొని కాలనీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుద్దాల రాముగౌడ్, కార్యవర్గ సభ్యులు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేయర్ సునీల్ రావు సతీమణి అపర్ణ రావు హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్వాసులు, మహిళలు పాల్గొన్నారు.
బద్దిపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు సర్పంచ్ రాచమల్ల మధు, ఉప సర్పంచ్ రాచమల్ల మనోజ్, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ తాండ్ర శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా రుద్ర రాధ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కోశాధికారి గోలి రాజు, పోరెడ్డి నరేందర్రెడ్డి, తాండ్ర నరేశ్, పోలవరం శరత్, పెరిక శ్రీకాంత్, శేఖర్ పాల్గొన్నారు.
మండలంలోని చామనపల్లి గ్రామంలో శనివారం హనుమాన్నగర్ గణేశ్ ఉత్సవ కమిటీ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులను సర్పంచ్ బోగొండ లక్ష్మి, ఉపసర్పంచ్ దావు నిర్మల, 7వ వార్డు సభ్యురాలు బుర్ర లక్ష్మి పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్నగర్ గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు వడ్లకొండ రంజిత్, కోడూరి గౌతం, ప్రధాన కార్యదర్శి కొట్టె హరికృష్ణ, కోశాధికారి అవారి సునీల్, సంయుక్త కార్యదర్శి వడ్లకొండ కమలాకర్, సభ్యులు దొంతుల సాగర్, వడ్లకొండ రమేశ్, బత్తిని సాయికిరణ్, మహిళలు పాల్గొన్నారు.