Sri Rama Navami | రాష్ట్రంలోని రామభక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కేవలం రూ.116 చెల్లిస్తే చాలు భద్రాద్రి రాములోరి ముత్యాల తలంబ్రాలను ఇంటివద్దకే తెచ్చి ఇస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేయగా, టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. నేరుగా కస్టమర్ల ఇంటికే వెళ్లి అందజేసేలా కసరత్తు చేస్తున్నారు. తలంబ్రాలు కావాల్సిన వారు సమీపంలోని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ లేదా ఆర్టీసీ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
– తెలంగాణచౌక్, మార్చి 28
తెలంగాణచౌక్, మార్చి 28: రాష్ట్రంలోని రామభక్తులకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.116 చెల్లిస్తే చాలు.. భ ద్రాద్రి రాములోరి ముత్యాల తలంబ్రాలు, ఇం టివద్దకే తెచ్చి ఇస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రకటన విడుదల చేయగా, ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు కసర త్తు చేస్తున్నారు. ఔత్సాహిక భక్తులు సమీపంలోని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ వద్ద లేదా ఆర్టీసీ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వద్ద గానీ రూ.116 చెల్లించి, వివరాలిస్తే ఏప్రిల్ 3 నుంచి ముత్యాల తలంబ్రాలు అందజేస్తామని చెప్పా రు.
కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకునే అవకాశం కల్పించారని, గతేడాది కూడా రీజియన్లో 6 వేల మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా, ఈ సారి ఇప్పటికే 4వేల మంది బుక్ చేసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ కరీంనగర్ జోన్ డిప్యూటీ సిటీఎం కేశరాజు భానుకిరణ్ తెలిపారు. రీజియన్లోని డి పోల వారీగా నియమించిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను ఫోన్లో సంప్రదించవచ్చని వివరాలు వెల్లడించారు.
గోదావరిఖని 9154298 554, హుస్నాబాద్ 9154298673, హుజూరాబాద్ 9154298559, కరీంనగర్ ఒకటోడిపో 9154298561, రెండో డిపో 915429 8565, మంథని 9154298567, జగిత్యాల 9154298565, కోరుట్ల 9154298572, మెట్పల్లి 91542998574, సిరిసిల్ల, వేములవాడ 9154298576, రీజియన్ కార్యాల యం 9154298581 నంబర్లలో సంప్రదించాలన్నారు. రీజియన్ నుంచి రాష్ట్రంలోని 450 ప్రదేశాల్లో ఆర్టీసీ కౌంటర్లకు పార్శిల్లు, కవర్లు, పెరశాబుల్స్ పంపే సదుపాయం ఉన్న దృష్ట్యా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ప్రకటనలో వివరించారు.