సిరిసిల్ల రూరల్, జూలై 5: మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. నేడు ఆయన వర్ధంతిని పురస్కరించుకొని గురువారం మరో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ఆవిష్కరిం చనున్నారు. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి వ్యవసాయాభివృద్ధికి బాబు జగ్జీవన్రామ్ చేసిన కృషిని వివరించారు. కానీ, జగ్జీవన్రామ్ కృషిని నాటి కాంగ్రెస్ నేతలు విస్మరించారని ప్రస్తావించారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ సభలో త్వరలో ప్రారంభించనున్న వ్యవసాయ పీజీ కళాశాలకు బాబు జగ్జీవన్రామ్ పేరు పెడతామని ప్రకటించారు. ఈ మేరకు కళాశాల ఆవరణలో బాబు జగ్జీవన్రాం విగ్రహాన్ని ఏర్పాటు చేయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.