సైదాపూర్/చిగురుమామిడి, మార్చి 5: ‘ఎంపీ సంజయ్కు కరీంనగర్ ఏమైనా పునరావాస కేంద్రమా..? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటుకు పోటీ చేసే ఆయనకు మళ్లీ ఎందుకు ఓటేయాలి?’ అని మాజీ ఎంపీ, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. సైదాపూర్లోని వీర్లబండలో మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, చిగురుమామిడి మండలం సుందరగిరిలో మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, తాను ఎంపీగా గెలిచిన తర్వాత రూ.వెయ్యికోట్లతో స్మార్ట్సిటీ, కరీంనగర్ నుంచి మనోహరాబాద్ వరకు రైల్వేలైన్ తీసుకవచ్చానని, పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక అయ్యానని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లలో సంజయ్ నియోజకవర్గానికి ఏ మీ చేయలేదని, ఐదు రూపాయలు కూడా తే లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయాచోట్ల సమావేశాల్లో జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్రావు, ఎంపీపీలు సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, కొత్త వినీత, సింగిల్విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీలు రావుల శ్రీధర్రెడ్డి, బేతి రాజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు రూప్సింగ్, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్రెడ్డి, సాంబారి కొమురయ్య, గవ్వ వంశీధర్రెడ్డి, ఎంపీటీసీ ఓదెలు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు చెల్మల్ల రాజేశ్వర్రెడ్డి, మంకు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్లో ఈనెల 12న నిర్వహించే కేసీఆర్ సభను విజయవంతం చేయాలి. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉన్నది. ఎవరూ అధైర్య పడద్దు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్కుమార్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి. వినోద్కుమార్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.
– వొడితల సతీశ్కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే