వేములవాడ రూరల్, మే 15: అగ్రహారం ఆలయాన్ని మినీ కొండగట్టుగా తీర్చిదిద్దుతామని, కోటి నిధులతో అభివృద్ధి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు పేర్కొన్నారు. సోమవారం అగ్రహారం హనుమాన్ ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి ఆమోదంతో రెనోవేషన్ కమిటీని వేసినట్లు చెప్పారు. దేవుడికి, భక్తులకు సేవచేసే భాగ్యం రెనోవేషన్ కమిటీ సభ్యులకు దక్కడం అదృష్టంగా భావించాలని సూచించారు. అగ్రహారానికి ఎక్కడి నుంచో భక్తులు వస్తుంటారని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఆలయం ముందు సీసీ, షెడ్డుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఆలయ ఆవరణలో తన నిధుల నుంచి 7 లక్షలతో ఆర్వో ప్లాంట్ను వారంలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా, రెనోవేషన్ కమిటీ సభ్యులుగా చేపూరి నాగరాజు, పర్వతి భూమేశ్గౌడ్, నేరెళ్ల భాస్కర్గౌడ్, వనపట్ల నర్సింహారెడ్డి, కొమ్మన బో యిని అభిమన్యు, మెర్గు జల, బోయిని శ్రీనివాస్, ఆరె సత్యనారయణ, పెరుమాండ్ల రవిచందర్గౌడ్, జంగిటి సంజీవ్, ఆకుల వెంకటేశ్, తాళ్లపల్లి సత్యనారాయణ, సిద్దంశేట్టి శ్రీనివాస్, కుసుంబ జనార్ధన్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ జడ్పీచైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ బూర వజ్రమ్మ, చంద్రయ్య, జడ్పీటీసీ రవి, ఏశ వాణి, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, సర్పంచులు వెంకటరమణ, రంగు సత్తమ్మ, ఎంపీటీసీ దేవరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ప్రవీణ్, రవి, ఎల్లయ్య ఉన్నారు.