అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాద పూర్వకంగా కలిశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడం, రుణమాఫీ ప్రక్రియను పునః ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
– చొప్పదండి, ఆగస్టు 3