ASHA workers | చిగురుమామిడి, మే 5 : పెండింగ్లో ఉన్న ఆశాల పారితోషికాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద నల్ల బ్యాడ్జీలతో మంగళవారం నిరసన తెలిపారు. వేతనాలు పెంచుతామని పెంచకుండా, రెండు నెలలు నుండి ఇవ్వకుండా ప్రభుత్వం వెట్టిచాకిరిగా పని చేయించుకుంటుందని ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశాలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చిన పట్టించుకోవడం లేదన్నారు. ఆశాల డిమాండ్ లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నాగేల్లి పద్మ, కార్యదర్శి బోయిని ప్రియాంక, కోశాధికారి పార్నంది అంజలి, ఆశాలు బండారి సరోజన, పుష్ప, శ్వేత, లక్ష్మీ, తిరుమల, కవిత, కమల, సునీత తదితరులు ఉన్నారు.